Keerthy Suresh: చందానగర్‌లో కళావతి సందడి

21 May, 2022 08:23 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నిన్నటిదాకా మహానటి నేడు కళావతిగా మారిందంటూ చమత్కరించారు సినీనటి కీర్తి సురేష్‌. చందానగర్‌ లో ఏర్పాటు చేసిన నీరూస్‌ డిజైనర్‌ షోరూమ్‌ ను శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. గతంలో అభిమానులు మహానటి అని పిలిచేవారని ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం తర్వాత కళావతి అని పిలుస్తున్నారన్నారు.

కాగా మహానటితో గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది కీర్తిసురేశ్‌. ఆ తర్వాత అలాంటి సీరియస్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తూ వచ్చింది. కాని సర్కారు వారి పాటలో మ.. మ.. మహేషా సాంగ్ తో కీర్తి  వేసిన స్టెప్పులు చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. మహానటి వేసిన మాస్ మూవ్ కు ఫిదా అయ్యారు. సర్కారు వారి పాటతో అందివచ్చిన మాస్ ఇమేజ్ ను కీర్తీ సురేష్ కంటిన్యూ చేయాలనుకుంటోంది. నేచురల్ స్టార్ నానితో కలసి నటించబోయే కొత్త సినిమా ‘దసరా’లో మరోసారి మాస్ క్యారెక్టర్‌తో సర్‌ప్రైజ్‌ చేయనుంది.

A post shared by 𝐍𝐞𝐞𝐫𝐮'𝐬 - 𝕀𝕟𝕕𝕚𝕒𝕟 𝔼𝕥𝕙𝕟𝕚𝕔𝕤 (@neerusindia)

చదవండి 👉🏾  వెంకటేశ్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

ఒక మ్యూజిక్‌ స్కూల్‌ స్టార్ట్‌ చేసి ఫ్రీగా నేర్పించాలనుకుంటున్నా

మరిన్ని వార్తలు