ముగ్గురి స్నేహితుల అదృష్టం

16 Oct, 2023 06:37 IST|Sakshi

నరేష్‌ అగస్త్య, అభినవ్‌ గోమఠం, విశ్వదేవ్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన క్రైమ్‌ కామెడీ ఫిల్మ్‌ ‘కిస్మత్‌’. అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో రియా సుమన్‌ హీరోయిన్‌. శ్రీనాథ్‌ బాదినేని దర్శకత్వంలో రాజు నిర్మించిన ఈ చిత్రం నవంబరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను హీరో శ్రీ విష్ణు విడుదల చేశారు. ముగ్గురు స్నేహితులు తమ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని ఆశిస్తుంటారు. విశ్వదేవ్‌ నమ్మకం కోల్పోయి ఉంటాడు. అభినవ్‌ గోమఠంకి సినీ రచయిత అవ్వాలన్నది కల. రియా సుమన్‌తో నరేశ్‌ అగస్త్య ప్రేమలో ఉంటాడు.

ఓ సంఘటనతో ఈ ముగ్గురి కిస్మత్‌ (అదృష్టం) ఎలా మారిపోయింది అనేది ఈ చిత్రకథ అని యూనిట్‌ పేర్కొంది.  ఇక టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నరేశ్‌ అగస్త్య మాట్లాడుతూ– ‘‘కిస్మత్‌’ లాంటి చిత్రాలు మౌత్‌ టాక్‌ వల్లే హిట్టవుతాయి. ప్రేక్షకులు మమ్మల్ని సపోర్ట్‌ చేయాలి’’ అన్నారు. ‘‘మంచి క్రైమ్‌ కామెడీ ఫిల్మ్‌ ఇది’’ అన్నారు అభినవ్‌ గోమఠం. ‘‘చక్కని ఫన్‌ ఫిల్మ్‌ ఇది’’ అన్నారు విశ్వదేవ్‌. ‘‘రాజు రెండేళ్ల పాటు ఈ సినిమా స్క్రిప్ట్‌పై వర్క్‌ చేశారు. నరేశ్, అభినవ్, విశ్వలతో పాటు అందరూ అద్భుతంగా నటించారు’’ అన్నారు శ్రీనాథ్‌. ఈ చిత్రానికి సంగీతం: మార్క్‌ కె. రాబిన్, కెమెరా: వేదరామన్‌ శంకర్, సహనిర్మాత: భాను ప్రసాద్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భరత్‌ రెడ్డి. 

మరిన్ని వార్తలు