కోలా బాలకృష్ణ హీరోగా 'నేనెవరు?'

30 Jan, 2021 03:38 IST|Sakshi
కోలా బాలకృష్ణ

తెలుగు–తమిళ భాషల్లో సుప్రసిద్ధులైన ఎడిటర్‌ కోలా భాస్కర్‌ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘నేనెవరు’. సాక్షీ చౌదరి కథానాయికగా నటించారు. నిర్ణయ్‌ పల్నాటి దర్శకత్వంలో కౌశల్‌ క్రియేషన్స్‌ పతాకంపై భీమినేని శివప్రసాద్‌–తన్నీరు రాంబాబు నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్ణయ్‌ పల్నాటి, భీమినేని శివప్రసాద్‌ – తన్నీరు రాంబాబు మాట్లాడుతూ– ‘‘విభిన్న కథతో రూపొందిన చిత్రమిది. లవ్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. కోలా భాస్కర్‌ ఎడిటింగ్‌ చేసిన చివరి (గత ఏడాది నవంబర్‌లో ఆయన మరణించారు) చిత్రమిది. త్వరలో టీజర్‌ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: పూనమ్‌ చంద్, కుమావత్, కిరణ్‌ కుమార్‌ మోటూరి, కెమెరా: సామల భాస్కర్, సంగీతం: ఆర్‌.జి.సారథి.

మరిన్ని వార్తలు