‘సర్కారువారి పాట’ అప్‌డేట్స్‌ ఎప్పుడంటే..

12 Jun, 2021 00:40 IST|Sakshi
మహేశ్‌బాబు

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారువారి పాట’ అప్‌డేట్స్‌ కోసం ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ కథనాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ గురించి భిన్నమైన వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో... ‘‘సర్కారువారి పాట’ చిత్రీకరణను తిరిగి ప్రారంభించిన తర్వాత, ఈ సినిమా గురించిన మరిన్ని అప్‌డేట్స్‌ను అధికారికంగా ప్రకటిస్తాం. అప్పటివరకు కోవిడ్‌ నియమ నిబంధనలను పాటిస్తూ అందరూ జాగ్రత్తగా ఉండండి’’ అని చిత్రబృందం పేర్కొంది.

మరిన్ని వార్తలు