#SSMB28: మహేశ్‌-త్రివిక్రమ్‌ మూవీ.. క్రేజీ అప్‌డేట్‌ వదిలిన మేకర్స్‌

9 Jul, 2022 13:32 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజాల తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది.  ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రూపొందే ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్‌ఎంబీ28 (SSMB28) అనే వర్కింగ్‌ టైటిల్‌తో సెట్స్‌పైకి తీసుకురానున్నారు. మహేశ్‌-త్రివిక్రమ్‌లో కాంబినేషన్‌ అనగానే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

చదవండి: ‘విక్రమ్‌’ మేకింగ్‌ వీడియో చూశారా?.. డైరెక్టర్‌ ఫోకస్‌కు నెటిజన్లు ఫిదా!

దీంతో ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చేది ఎప్పుడెప్పుడా? అని ఫ్యాన్స్‌ ఆత్రుతుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ను వదిలారు మేకర్స్‌. ‘ఎస్‌ఎస్‌ఎంబీ28 చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. అగస్ట్‌లో రెగ్యూలర్‌ షూటింగ్‌ జరగనుంది’ అని మేకర్స్‌ ట్విటర్‌ వేదికగా తెలిపారు. అలాగే వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. ఇందులో మహేశ్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

చదవండి: Priya Anand: 'నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా' 

మరిన్ని వార్తలు