Mahesh Babu: 'సొంతగడ్డపై జరగడం ఆనందంగా ఉంది.. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు'

10 Jan, 2024 11:24 IST|Sakshi

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మరో చిత్రం గుంటూరు కారం. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్‌ కాగా.. యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిమానుల భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా గుంటూరు కారం మేకర్స్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. తాజాగా ఈవెంట్ సక్సెస్ కావడం పట్ల మహేశ్ బాబు ట్వీట్‌ చేశారు. ఈవెంట్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

మహేశ్‌బాబు తన ట్వీట్‌లో రాస్తూ..' థ్యాంక్ యూ గుంటూరు!! నా సినిమా ఈవెంట్‌ హోమ్‌టౌన్‌లో జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఇది గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకం. మీ అందరినీ ప్రేమిస్తున్నా.. నా సూపర్ ఫ్యాన్స్‌ను మళ్లీ చూడాలని ఎదురుచూస్తున్నా. అతి త్వరలో మళ్లీ కలుద్దాం. ఇప్పుడే సంక్రాంతి మొదలవుతోంది. నిన్న జరిగిన కార్యక్రమానికి సహకరించిన గుంటూరు పోలీస్ డిపార్ట్‌మెంట్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. 

>
మరిన్ని వార్తలు