Thondimuthalum Driksakshiyum In AHA: ఆహాలో మలయాళ మూవీ దొంగాట, ఎప్పటినుంచంటే?

1 May, 2022 13:47 IST|Sakshi

కరోనా సమయంలో ఓటీటీల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. థియేటర్‌కు వెళ్లాలంటనే జంకిన సినీప్రేక్షకుడు ఎంచక్కా ఉన్నచోటునే సినిమా చూసే అవకాశం కల్పించడంతో ఓటీటీకి జై కొట్టాడు. అలా దేశంలో పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. వాటికి గట్టి పోటీనిస్తూ తెలుగులో ఆహా ఓటీటీ లాంచ్‌ చేశారు. దీనికి సినీప్రియుల నుంచి విశేషాదరణ లభించింది.

ఎప్పటికప్పుడు కొత్త సినిమాలతో ఎంటర్‌టైన్‌ చేస్తున్న ఆహా తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించింది. ఈ శుక్రవారం మరో మలయాళ మూవీని ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఫహద్‌ ఫాజిల్‌ నటించిన తొందిముతలమ్‌ దృక్షక్షియుం అనే మూవీని దొంగాట పేరుతో మే 6 నుంచి స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ట్వీట్‌ చేసింది. జాతీయ అవార్డు అందుకున్న ఈ సినిమాను ఈ ఫ్రైడే చూసేయండని పేర్కొంది.

చదవండి: అనిల్‌ అదృష్టం, బిగ్‌బాస్‌ నుంచి హమీదా ఎలిమినేట్‌!

మరిన్ని వార్తలు