విలేజ్‌లో మిస్టరీ 

4 Mar, 2024 01:38 IST|Sakshi

రవితేజ నున్నా, నేహ జురెల్‌ హీరో హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’. మణికొండ రంజిత్‌ సమర్పణలో సత్యరాజు  దర్శకత్వంలో ముత్యాల రామదాసు, నున్నా కుమారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్‌ కానుంది.

మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సాగే విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘‘విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కమర్షియల్‌ సబ్జెక్ట్‌ ఈ చిత్రం. ఎన్నో ఇబ్బందులు పడి ఈ సినిమా పూర్తి చేశాం’’ అన్నారు రవితేజ. ‘‘ఈ సినిమాలో హిట్‌ కళ కనిపిస్తోంది’’ అన్నారు ముత్యాల రామదాసు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు సత్యరాజ్‌. ఈ చిత్రానికి సంగీతం: రోషన్‌ సాలూరి.

∙నేహ జురెల్, రవితేజ నున్నా

whatsapp channel

మరిన్ని వార్తలు