Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి కన్నుమూత.. బోరున ఏడ్చేసిన నటి

29 Jan, 2023 12:13 IST|Sakshi

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్‌లో బాధపడుతున్న​‍ ఆమె తల్లి జయ కన్నుమూశారు.  రాఖీ సావంత్ తల్లి చనిపోయిందని నటి భర్త ఆదిల్ దురానీ ధృవీకరించారు. కాగా.. ఆమె కొద్ది రోజులుగా ఆస్పత్రిలో బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడుతోంది.  చికత్స పొందుతూ ముంబయిలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తన తల్లి మరణ వార్తను రాఖీ సావంత్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది.  తల్లి ఆసుపత్రిలో ఉన్న వీడియోను పోస్ట్‌ చేసిన రాఖీ ఎమోషనల్‌ నోట్ రాసింది.

‘ఇకపై నన్ను ఆశీర్వదించే మా అమ్మ చేయి నా తలపై ఉండదు. ఇంకా నేను కోల్పోవడానికేమీ లేదు. అమ్మా.. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. మిస్‌ యూ అమ్మా' అని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు, నటీనటులు ధైర్యం చెబుతున్నారు. ఇటీవలే రాఖీ సావంత్‌ను సమస్యలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. తల్లి మరణంతో మరింత విషాదంలో మునిగిపోయింది నటి. తల్లి మరణాన్ని తట్టుకోలేక బోరున ఏడ‍్చేసింది రాఖీ సావంత్. 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

మరిన్ని వార్తలు