Samantha-Vijay Deverakonda: సమంత-విజయ్‌ ‘ఖుషి’ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్‌!

20 Feb, 2023 10:24 IST|Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత, రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ జంటగా నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘ఖుషి’. ఇప్పటికే మొదలైన ఈ మూవీ షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ను కశ్మీర్‌లో జరపుకుంది. ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డ సినిమా షూటింగ్‌ మార్చిలో తిరిగి ప్రారంభ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం

కాగా మయోసైటీస్‌ వ్యాధి కారణంగా సమంత షూటింగ్స్‌కి కొంచెం విరామం ఇవ్వడంతో ‘ఖుషి’ చిత్రీకరణ ఆలస్యం అవుతోంది. ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత ఇటీవల ముంబైలో జరిగిన హిందీ వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌’ షూటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో త్వరలో ‘ఖుషి’ సినిమా షూటింగ్‌ను కూడా షురూ చేయనున్నారామె. మార్చి మొదటి వారంలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ తిరిగి ప్రారంభమవుతుందట. ఈ షెడ్యూల్‌లో విజయ్, సమంతలు పాల్గొంటారని టాక్‌. ఈ సంగతి ఇలా ఉంచితే ‘ఖుషి’ ని గత ఏడాది డిసెంబరు 23న రిలీజ్‌ చేయాలనుకున్నారు.. షూటింగ్‌ ఆలస్యం కావడంతో ఈ ఏడాది రిలీజ్‌ కానుంది.  

చదవండి: ఫిల్మ్ ఛాంబర్కు తారకరత్న భౌతికకాయం

మరిన్ని వార్తలు