పల్లెటూర్లో పరేషాన్‌

22 Feb, 2023 01:28 IST|Sakshi

తిరువీర్, పావని కరణం జంటగా రూపక్‌ రోనాల్డ్‌సన్‌ దర్శకత్వంలో సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించిన చిత్రం ‘పరేషాన్‌’. తెలంగాణలోని ఓ పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో తీరువీర్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చాలా సహజంగా వుంటుంది’’ అన్నారు. ‘‘అందరం ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాం’’ అన్నారు రూపక్‌ రోనాల్డ్‌సన్‌. ఇదొక  ప్రత్యేకమైన సినిమా’’ అన్నారు సిద్ధార్థ్‌. 

మరిన్ని వార్తలు