వైవిధ్యమైన కథ

25 Sep, 2023 01:06 IST|Sakshi
సుమన్‌

నటుడు సుమన్‌ ప్రధాన పాత్రలో మునిప్రసాద్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘సిర్నాపల్లి సంస్థాన్‌’. మనోహర్, శ్రీనివాస్, జ్యోతీసింగ్, శృతీ పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. కృష్ణకాంతి క్రియేషన్స్‌లో మంచాల రమేశ్‌ యాదవ్‌ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

మంచాల రమేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘సిర్నాపల్లి సంస్థాన్‌’. మునిప్రసాద్‌ చక్కగా తీశారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేల్‌ మురుగన్, సంగీతం: ఏలేందర్‌. 

మరిన్ని వార్తలు