Acharya Vidyasagar Maharaj: తనువు చాలించిన విద్యాసాగర్‌ మహారాజ్‌ .. ప్రధాని మోదీ నివాళి!

18 Feb, 2024 12:44 IST|Sakshi

ప్రముఖ జైన దిగంబర ముని ఆచార్య విద్యాసాగర్  మహారాజ్ శనివారం తనువు చాలించారు. గత ఏడాది నవంబర్‌ ఐదున ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆచార్య విద్యాసాగర్  మహారాజ్ మృతి పట్ల ‍ప్రధాని నరేంద్ర మోదీ  సంతాపం వ్యక్తం చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లోని చంద్రగిరి జైన దేవాలయంలో విద్యాసాగర్ మహారాజ్ శనివారం అర్థరాత్రి 2:35 గంటలకు తన దేహాన్ని విడిచిపెట్టారు. దీనికి ముందు ఆయన ఆచార్య పదవిని వదులుకున్నారు. మూడు రోజులపాటు ఉపవాసం ఉంటూ, మౌనం పాటించారు. అనంతరం ప్రాణాలు విడిచారు. విద్యాసాగర్ మహారాజ్‌ మరణవార్త తెలియగానే జైన సమాజానికి చెందిన పలువురు చంద్రగిరి జైన దేవాలయానికి చేరుకున్నారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 
 

whatsapp channel

మరిన్ని వార్తలు