మిషన్‌ దివ్యాస్త్ర విజయవంతం.. అభినందించిన ప్రధాని మోదీ

11 Mar, 2024 18:42 IST|Sakshi

న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ విజయవంతమైంది. మిషన్‌ దివ్యాస్త్రలో భాగంగా భారత రక్షణ పరిశోధనా సంస్థ (DRDO) ఈ ప్రయోగం చేపట్టింది. ఈ ప్రాజెక్టు భారత అణు నిరోధక శక్తిని పెంచే లక్ష్యంతో మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌(ఎంఐఆర్‌వీ) పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ ప్రాజెక్టు భారత అణు నిరోధక శక్తిని పెంచే లక్ష్యంతో అగ్ని-5 రేంజ్‌.. 7 వేల కిలోమీటర్లకు పైగా ఉండే అవకాశం ఉంది.

మిషన్‌ దివ్యాస్త్ర విజయవంతంతో డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నామని ట్వీట్‌ చేశారు. అగ్ని-5 క్షిపణి ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదిందించి. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వి) సాంకేతికతతో డీఆర్డీవో మిస్సైల్‌ను రూపొందించింది. ఎంఐఆర్‌వీ సాంకేతికతతో అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం దేశం రక్షణ సంసిద్ధత, వ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని మోదీ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. మిషన్​ దివ్యాస్త్ర అతిపెద్ద అడ్వాన్స్‌డ్‌ వెపన్స్ సిస్టమ్‌గా తెలుస్తోంది. దీనికి దేశ భౌగోళిక స్థితిగతులను మార్చే సత్తా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎంఐఆర్‌వీ టెక్నాలజీతో ఒక మిసైల్‌ను ఉపయోగించి బహుళ వార్ హెడ్స్‌ను వివిధ ప్రాంతాల్లోని టార్గెట్స్‌ను ఛేదించవచ్చని పేర్కొన్నాయి. అయితే, ఈ టెక్నాలజీ కలిగిన దేశాల సంఖ్య తక్కువగా ఉండగా.. ఆయా దేశాల సరసన భారత్‌ సైతం చేరినట్లయ్యింది. ఈ అగ్ని-5 మిసైల్‌లో ఇండీజీనియస్ ఏవియోనిక్స్ సిస్టస్స్‌ ఉంటాయి. హై ఎక్యురసీ సెన్సార్​ ప్యాకేజ్‌ ఉండడంతో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers