మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

2 Oct, 2022 18:53 IST|Sakshi

మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ సంబరాలకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ హాజరయ్యారు. 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతకమ్మ పండగ. అలాంటి బతుకమ్మ పండుగను సభ్యులు ఘనంగా నిర్వహించారంటూ ఈ సందర్భంగా గాదరి కిషోర్‌ కుమార్‌ వారిని అభినందించారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్ల విషయంలో టీఆర్‌ఎస్‌ మలేషియా చూపిన చొరవపై ప్రశంసల వర్షం కురిపించారు. 

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మారుతి కుర్మ,  కార్యదర్శి సందీప్ కుమార్ లగిశెట్టి, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సత్యనారాయణరావ్ నడిపెల్లి, నవీన్ గౌడ్ పంజాల, హరీష్ గుడిపాటి, రవిందర్ రెడ్డి, శ్యామ్, సంపత్ రెడ్డి, పూర్ణ చందర్ రావు, కిషోర్ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు