జాతీయ మాస్టర్స్‌ అథ్లెట్‌కు ఎస్పీ ప్రశంసలు

31 Mar, 2023 02:24 IST|Sakshi
నాయుడును అభినందిస్తున్న ఎస్‌పి ఎం.దీపిక

విజయనగరం క్రైమ్‌: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని మిడ్నాపూర్‌, కోల్‌కత్తాలో ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు జరిగిన 42, 43వ జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ –2022, 2023 క్రీడా పోటీల్లో విజయనగరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో హెచ్‌సీగా పనిచేస్తున్న వి.కృష్ణంనాయుడు విశేషప్రతిభ కనబర్చి నాలుగు బంగారు, రెండు రజత, ఒక కాంస్య పతకం సాధించారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ ఎం.దీపికను ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె నాయుడును అభినందించి, క్రీడాప్రతిభను ప్రశంసించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ క్రీడల పట్ల ఎంతో ఆసక్తితో సాధనచేసి జాతీయస్ధాయిలో పతకాలు సాధించడం చాలా గొప్ప విషయమని, ఆయన క్రీడా స్పూర్తి యువతకు ఆదర్శమని ప్రశంసించారు. అనంతరం విజయనగరం ఇన్చార్జ్‌ డీఎస్పీ ఆర్‌.శ్రీనివాసరావు, రూరల్‌ సీఐ టీవీ.తిరుపతిరావు, ఎస్సై గణేష్‌లు నాయుడును అభినందించారు.

మరిన్ని వార్తలు