బలియా: బీజేపీని అధికారంలోకి రాకుండా ఆపే సత్తా సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్కు లేదని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్తో జతకట్టారని, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నారని గుర్తు చేశారు.
అయినా రెండు మార్లు బీజేపీ విజయాన్ని ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు. మైనార్టీలు తమ కూటమి (బీఎస్ఎం)కి మద్దతు ఇవ్వాలని, ఎస్పీ, బీఎస్పీ మధ్య ఫుట్బాల్లాగా మారవద్దని కోరారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించడం తమ కూటమి వల్ల మాత్రమే సాధ్యమన్నారు.