ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభం
నేడు నంద్యాలలో సాయంత్రం సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ
నిన్న ఇడుపులపాయలో మొదలై.. కడప పార్లమెంట్ పరిధిలో సాగిన యాత్ర
అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన అభిమాన గణం
ప్రొద్దుటూరు బహిరంగ సభకు పోటెత్తిన జనం
#MemanthaSiddham Day-2 Live Updates..
05:55PM, March 28, 2024
నంద్యాల భారీ బహిరంగ సభలో సీఎం జగన్
నంద్యాల ఓ జన సముద్రంలా కనిపిస్తోంది
5:45PM, March 28, 2024
నంద్యాలలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ
నంద్యాల చేరుకున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
ఎర్రగుంట్లకు వెళ్లేదారిలో నూతన జంట వెంకటస్వామి, కావేరి దంపతులకు సీఎం వైఎస్ జగన్ ఆశీర్వాదం
మేము సిద్దం రోడ్ షోలో తనను చూసేందుకు వచ్చిన అవ్వను ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్
►దీబగుంట్లకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర.
యర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో సీఎం జగన్ ముఖాముఖి..
యర్రగుంట్లలో సీఎం జగన్ మాట్లాడుతూ..
►కార్యక్రమంలో వికలాంగుడైన లబ్దిదారుడు ప్రసాద్ మాట్లాడుతూ.. నేను, నా భార్య వికలాంగులం. మాకు పెన్షన్ ఆరు వేలు వస్తోంది. జగనన్న అందిస్తున్న సాయం వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. జగనన్న మేలు మా జీవితంలో మరిచిపోలేం. సీఎం జగన్ గొంతులా మిమిక్రీ చేయడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా కేకలు వేశారు.
►మరో లబ్ధిదారుడు మాట్లాడుతూ.. తన కుమారుడికి ఆరోగ్య శ్రీ కింద ఎంతో మేలు జరిగింది. పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చేయాల్సిన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగింది. దీంతో, నా కుమారుడు మీ దయతో ఆరోగ్యంగా ఉన్నాడు. దేశంలోనే నెంబర్ వన్ సీఎం జగన్ అని కితాబు.
ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి మాట్లాడుతూ.. మరో 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అందరూ కూడా రకరకాల జిమ్మిక్కులతో పగటివేషగాళ్ల మాదిరి మీ ముందుకు వస్తున్నారు. మీరు ఇవన్నీ గమనిస్తున్నారు కూడా. మీకు ఈరోజు రెండు విషయాలు చెబుతాను. సీఎం వైయస్ జగన్ 2019లో సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు అధికారంలోకి వస్తే రైతు భరోసా, అమ్మఒడి, చేయూత వంటి సంక్షేమ పథకాలతో నవరత్నాలను ప్రకటించారు. ఆ పాదయాత్రలో మీ మద్దతు చూరగొని 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ తూచా తప్పకుండా ఎన్ని ఇబ్బందులు, కష్టాలు వచ్చినా ప్రతి ఒక్క హామీని ఎలాంటి దళారుల వ్యవస్థ లేకుండా నేరుగా మీకే అందించారు.
గత ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అందివ్వకపోగా దాదాపు 650 హామీలను ఇచ్చి ఒక్కదాన్ని కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టిన పరిస్థితి. ఇప్పుడు కూడా మనం ఒకటే చెబుతున్నాం మాకు అధికారం ఇస్తే మీ గ్రామాలను మారుస్తాం, మీ పిల్లలకు మంచి బడులు కట్టిస్తాం, మంచి చదువులు చెప్పిస్తాం, మంచి వైద్యం అందుబాటులోకి తీసుకొస్తాం, మహిళలకు చేయూత అందిస్తామని ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తామని కోరుతుంటే ఇవాళ ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో గమనించండి. ఒకడు అధికారంలోకి వస్తే మా దగ్గర ఎర్రబుక్కు ఉంది, అందులో పేర్లు ఉన్నాయని అంటాడు. అంటే మీరు వేసే ఓటు మీకు మంచి జరగడానికి వేయాలా? వాళ్ల పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి వేయాలా? అని మీరందరూ ఆలోచన చేయాలి.
ఇంకొకడు..మేం అధికారంలోకి వస్తే మీరు గుడుల్లో, బడుల్లో దాచి పెట్టుకోవాలి అంటాడు. మేం కూడా ఆళ్లగడ్డ వాళ్లమే, గుడుల్లో, బడుల్లో దాచిపెట్టుకోవాల్సిన అవసరం రాదు కలలు మానుకోండి. అధికారంలోకి వచ్చేది వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఎగిరేది వైఎస్సార్ కాంగ్రెస్ జెండా. 2019లో మీరు మంచి మనస్సుతో మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి మీకు పెద్దఎత్తున సంక్షేమం చేసే అవకాశం దొరికింది. కాబట్టి రానున్న రోజుల్లో మీకు, మీ కుటుంబాలకు మంచి జరిగింది కాబట్టి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరుతున్నాను.
వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రజలతో నేరుగా మాట్లాడటం ఈరోజే ప్రారంభిస్తున్నది కాదు. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ జనం కోసం నిలబడినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి మన జగనన్న. ఓదార్పులో, పాదయాత్రలో మన నుంచి విన్నారు దాని ఫలితం ప్రజా ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఈ ఐదేళ్లలో చేసి చూపారు. ఇప్పుడు మళ్లీ వినడానికి వచ్చారు.
పేదల కోసం పెత్తందారులందరితో యుద్ధం చేస్తున్నారు. ఈరోజు మన అక్కచెల్లెమ్మల కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం నిలబడాలంటే ఏం చేయాలో వినడానికి వచ్చారు. సామాన్యులకు ఇస్తున్నటు వంటి భరోసా శాశ్వతంగా నిలబడాలంటే ఏం చేయాలో మన అన్న వినడానికి వచ్చారు. అన్న మీరు మాకోసం నిలబడ్డారు. ఇంటాబయటా నిందలు వేస్తున్నా సామాన్యుల జెండాను, అణగారినవర్గాల అజెండాను మోసుకుంటూ నడుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు మా వంతు వచ్చింది. కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి మనకు ఒక సమయం వచ్చింది. సిద్ధమేనా మన అందరం.
►యర్రగుంట్లలో సీఎం జగన్.
►ఎర్రగుంట్లకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్
కాసేపట్లో సీఎం జగన్ ముఖాముఖి
►కాసేపట్లో ఎర్రగుంట్లలో మేధావులు, ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి
►ప్రజల నుంచి తన పాలనపై ఫీడ్బ్యాక్తో పాటు మరింత మెరుగుపర్చుకునేందుకు సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు
అంబులెన్స్కు దారిచ్చి ప్రాణం కాపాడిన సీఎం జగన్..
►బత్తులూరు సమీపంలో మేమంతా సిద్ధం యాత్ర
►సీఎం జగన్ కోసం బత్తులూరు ప్రజల ఎదురు చూపులు
► నల్లగట్టు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర
► ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కొనసాగుతున్న బస్సు యాత్ర
► ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభమైంది.
►మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజైన గురువారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్మోహన్రెడ్డి నైట్ హాల్ట్ ప్రాంతం నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామ స్థులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.
ఇది కూడా చదవండి: మోసాలు, నేరాలే వారి చరిత్ర: సీఎం జగన్
►అనంతరం గోవిందపల్లి మీదుగా ప్రయాణించి చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. తర్వాత నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
►అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురంలో ప్రజలతో మమేకమవుతూ పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
ప్రొద్దుటూరు సభలో సీఎం జగన్ కామెంట్స్..
విప్లవాత్మక మార్పులకు మారుపేరుగా ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రజల అజెండానే జెండాగా వైఎస్సార్సీపీ ముందుకెళుతోంది. ఈ జెండా మరో జెండాతో జత కట్టలేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాకు మద్దతుగా సిద్ధం అని ఈ జెండా తలెత్తుకుంది. ప్రజల అజెండాగా రెపరెపలాడుతోంది.
ఎన్నికల కోసం @ncbn మేనిఫెస్టో ఇచ్చి.. గెలిచాక ప్రజలకు కనిపించకుండా దాచేస్తారు.
గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతో సిగ్గులేకుండా జతకడతారు. ఇందుకోసం ఢిల్లీదాకా వెళ్లి కాళ్ళు పట్టుకుంటారు.
-సీఎం @ysjagan #TDPJSPBJPCollapse#EndOfTDP pic.twitter.com/sd9LoyJcxJ
— YSR Congress Party (@YSRCParty) March 27, 2024
పేద ప్రజల అభివృద్ధి కోసం 130 సార్లు బటన్ నొక్కాను. మీరు మే 13వ తేదిన ఫ్యాన్ గుర్తుపై రెండు మార్లు బటన్ నొక్కడంతోపాటు మరో వంద మందికి మన ప్రభుత్వం చేసిన మంచిని వివరించి ఓటు వేసేలా చైతన్యం తీసుకురావాలి. 48 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసం చేసేవాళ్లు మనకు ప్రత్యర్థులు. పేదల వ్యతిరేకులని ఓడించేందుకు మీరంతా సిద్ధమా.. (సిద్ధం అని జనం నినాదాలు) అబద్దాలు, మోసాలు, కుట్రల కూటమిపై గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ప్రజలకు మంచి చేయని చంద్రబాబు బృందాన్ని నమ్మితే నట్టేట ముంచడం ఖాయం.
ప్రభుత్వ ప్రయోజనాలు అందుకున్న ప్రతి కుటుంబం స్టార్ క్యాంపెయినర్గా బయటికి రావాలి. వారంతా మరో వంద మందికి చెప్పి మీ బిడ్డకు తోడుగా నిలవాలి. 2024 ఎన్నికల్లో ‘మన కోసం మనం’ ప్రతి ఒక్కరూ రెండుసార్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి. అలా నొక్కితేనే చంద్రముఖి బెడద ఉండదు. పొరపాటు జరిగితే చంద్రముఖి లక లక లక అంటూ సైకిల్పై వచ్చి టీ గ్లాస్ పట్టుకుని మీ ఇంటిలో రక్తం తాగుతుంది. చంద్రబాబుకు ఓటు వేయడమంటే మన పథకాలు మనమే రద్దు చేసుకోవడం. ఆయన్ను నమ్మడం అంటే మోసం, అబద్ధం, వెన్నుపోటును నమ్మడమే.
జననేతకు అడుగడుగునా ప్రజలు, పార్టీ శ్రేణుల నీరాజనం
Memantha Siddham Yatra - Day 1.#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/Lu0bmaA8Mb
— YSR Congress Party (@YSRCParty) March 27, 2024