నేడు సిరిసిల్ల, సిద్దిపేటల్లో కేసీఆర్‌ సభలు 

17 Oct, 2023 01:38 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని సిరిసిల్లలో మంగళవారం ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనుంది. ఇది సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం గమనార్హం.

మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభ కోసం మొదటి బైపాస్‌రోడ్డులో స్థలాన్ని సిద్ధం చేశారు. కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో సిరిసిల్లకు చేరుకుని సభలో పాల్గొంటారు. తర్వాత సిద్దిపేటలో జరిగే సభకు వెళతారు.

మరిన్ని వార్తలు