సాక్షి తాడేపల్లి: తెలంగాణ రాష్ట్రంలో జనసేనకు వచ్చిన ఎన్నికల ఫలితాలే ఆ పార్టీకి ఏపీలో కూడా వస్తాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అదే విషయాన్ని విశాఖలో పవన్ నిర్వహించిన సభ మరోసారి రుజువు చేసిందన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘విశాఖ అన్ని రకాలుగా మేలు చేసిందని చెప్పే మీరు విశాఖ రాజధాని అంశాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు?, ప్రపంచ స్థాయిలో ఈ నగరం అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ప్రయత్నిస్తుంటే ఈ సిటీపై విషం చిమ్ముతారు. నిన్న(గురువారం) విశాఖ వేదికగా పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. వ్యక్తిగతంగా సీఎంపై అవాస్తవాలతో కూడిన విమర్శలు చేశారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూశాక పవన్కు మతి భ్రమించినట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో బర్రెలక్క స్థాయిలో పవన్ సేన పోటీ పడింది. బర్రెలక్కను తక్కువ చేయడం లేదు.. ఆమె స్థాయి కూడా పవన్ సేన పోటీ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ మీకు ఏపీకి సంబంధం ఏమిటి?, మీరు ఏపీలో ఎంతకాలం ఉన్నారు. మీ స్థిర నివాసం తెలంగాణ. అక్కడ మీ బలం ఏంటో ఎన్నికల్లో కనిపించింది. మీ శంకర్గౌడ్కు ఎన్ని ఓట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ మీ నియోజకవర్గం ఏంటో చెప్పగలరా?,
ఎక్కడకు వెళ్తే అక్కడ మా నియోజక వర్గం అంటారు. అబ్రహం లింకన్ను మీకు లింక్ ఏమిటో...మీది చంద్రబాబు లింకన్ సంబంధం. అబ్రహం లింకన్ స్థాయి మీకెందుకు?, తెలంగాణలో ఒక పార్టీ.. ఇక్కడ మరోపార్టీ. తెలంగాణలో బీజేపీని నాశనం చేశారు. తెలంగాణలో ఒక పార్టీ.. ఇక్కడ మరో పార్టీ.. తెలంగాణా లో బిజెపి నీ నాశనం చేశారు. పవన్ కళ్యాణ్ది పొలిటికల్ కాంట్రాక్ట్,. అధికారికంగా బీజేపీతో అనధికారికంగా టీడీపీతో పవన్ సంబంధం’ అని మండిపడ్డారు.