పవన్ కళ్యాణ్‌కు విశాఖ ప్రజల షాక్‌

7 Dec, 2023 17:52 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: పవన్ కళ్యాణ్‌కు విశాఖ ప్రజలు షాక్‌ ఇచ్చారు. పవన్‌ సభకు జనాలు మొహం చాటేశారు. జనాలు లేక బహిరంగ సభ ప్రాంగణం వెలవెలబోయింది. ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది.

జనాలు లేక రెండు గంటలకుపైగా పవన్‌ కల్యాణ్‌ హోటల్‌ కే పరిమితమయ్యారు. గ్రౌండ్‌లో సగం వరకే కుర్చీలు వేసిన జనాలు కనిపించలేదు. జనాలను తీసుకురాలేక జనసేన నేతలు చేతులు ఎత్తేశారు. దీంతో జన సైనికులపై పవన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
చదవండి: అబద్ధాల బాబు.. నిజం చెప్పరుగా! 

>
మరిన్ని వార్తలు