మైనార్టీలకు సీఎం జగన్‌ పెద్దపీట

11 Aug, 2020 05:33 IST|Sakshi
సీఎంకు పుష్పగుచ్ఛం అందిస్తున్న ఎమ్మెల్సీ జకియా ఖానం. చిత్రంలో ఎంపీ మిథున్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

సీఎంను కలిసిన నూతన ఎమ్మెల్సీ జకియా ఖానం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్సీ జకియా ఖానం కొనియాడారు. నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన జకియా ఖానం సోమవారం సీఎంను క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం క్యాంపు కార్యాలయం వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సామాన్య కుటుంబానికి చెందిన తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపానన్నారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, రాయచోటి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మహిళా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని చెప్పారు. తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్‌రెడ్డి, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు