నిరుద్యోగ యువకులారా.. బీఆర్ఎస్ను ఓడించి గుణపాఠం చెప్పండి
కేఏ పాల్ తమ్ముడు గంగుల
గంగుల మనిద్దరి ఆస్తులను ప్రజలకు రాసిచ్చేందుకు సిద్దమా?
హుస్నాబాద్లో పొన్నంపై హరీశ్రావు సెటైర్లు
కోతల రాయుుడు వచ్చాడు ఒకాయన..మాటలు ఎక్కువ పని తక్కువ..
కరీంనగర్ లో ఓడిపోయి ఇక్కడకు వచ్చాడు
హుస్నాబాద్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం
కాంగ్రెస్, ఎర్రజెండాల పాలనలో కనీసం బుక్కెడు తాగు నీళ్లకు హుస్నాబాద్ నోచుకోలేదు
నేడు బంగారంలా రెండు పంటలు పండుతున్నాయి
తెలంగాణలో కేసీఆర్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టలేదు
అందుకే కేంద్రం 35 వేల కోట్లు ఇవ్వలేదు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రేవంత్రెడ్డి రోడ్ షో
బోరబండ ప్రాంతం ఒకప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉండేది
అన్నా అంటే నేనున్నా అని పీజేఆర్ ఆనాడు మీకు అండగా ఉన్నారు
ఇప్పుడు మీ కోసం కొట్లాడటానికి.. మీకు అండగా ఉండేందుకు కాంగ్రెస్ నాయకులున్నారు
ఇక్కడ రౌడీ మూకలు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారట.. జాగ్రత్త..వచ్చేది మా ప్రభుత్వం
ఒక్కొక్కరి మక్కెలు విరుగుతాయ్.. రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేసింది కాంగ్రెస్
అందుకే హైదరాబాద్ నగర ప్రజలు శాంతి భద్రతల సమస్య లేకుండా ప్రశాంతంగా ఉంటున్నారు
బోరబండకు ఒక స్మశానవాటిక ఏర్పాటు చేయని సన్నాసులు.. మళ్లీ ఓట్లు అడగడానికి వస్తుండ్రు
ఏ రాత్రి కష్టం వచ్చినా ఒక్క సీటీ కొట్టండి మీకు అండగా ఉండేందుకు వస్తా
పదేళ్లు కేసీఆర్కు అవకాశం ఇచ్చారు
కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వండి
పక్క గల్లీకి వెళితే కుక్క కూడా గుర్తుపట్టని పక్క పార్టీ వ్యక్తి
అజారుద్దీన్ ఎక్కడి నుంచి వచ్చారని అంటారా?
మోదీని ఎంత మంది గుర్తుపడతారో.. అజారుద్దీన్ను అంతే మంది గుర్తుపడతారు
కాంగ్రెస్ మిత్రపక్షాల సమన్వయ కమిటీ ఏర్పాటు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కన్వీనర్గా కమిటీ
కమిటీలో మిత్రపక్ష పార్టీలు కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ నాయకులకు స్థానం
కాంగ్రెస్ నుంచి మల్లు రవి, కోదండ రెడ్డి సీపీఐ నుంచి చాడ వెంకట్ రెడ్డి, బాల మల్లేశం, ఈటీ నర్సింహ, టిజేఎస్ కోదండరాం, విశ్వేశ్వర్ రావ్, బక్రుద్దీన్లకు చోటు
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కామెంట్స్
తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీని గెలిపించబోతున్నారు
తమిళనాడు,తెలంగాణకు పోలికలున్నాయి
అక్కడాఇక్కడా అవినీతి, కుటుంబ పార్టీలు ఏలుతున్నాయి
రెండు రాష్ట్రాల్లో విద్య, వైద్యం సహా అన్నిరంగాల్లో అభివృద్ధి కుంటుపడింది
రాజధాని హైదరాబాద్లోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయ్లెట్స్ లేవు
రెండు రాష్ట్రప్రభుత్వాలు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని నమ్ముకున్నాయి
తమిళనాడులో 18-60 మధ్య వయసున్న 90 శాతం మంది మగవాళ్లు మద్యానికి బానిసలయ్యారు
తమిళనాడులో 9మంది మంత్రుల మీద అవినీతి కేసులున్నాయి
తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు
ప్రజలు నవంబర్ 30 కోసం ఎదురుచూస్తున్నారు
మోదీవైపు, బీజేపీ వైపు నిలుస్తారని నమ్మకం ఉంది
బీఆర్ఎస్ "స్కాంగ్రెస్ " ప్రకటనలపై కాంగ్రెస్ ఆగ్రహం
బీఆర్ఎస్పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్
ఈసీ అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీని కించపరిచేలా బీఆర్ఎస్ పత్రికా ప్రకటనలపై అభ్యంతరం
ఎన్నికల నియమావళిని బీఆర్ఎస్ ఉల్లంఘిస్తోంది : అభిషేక్ మను సింఘ్వి
సీఈసీ బీఆర్ఎస్ ప్రకటనలపై చర్యలు తీసుకోవాలి
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని నిలుపుదల చేయాలి
తెలంగాణలో కుంభకోణాలకు పాల్పడింది కేసీఆరే
24న ప్రియాంక వరుస సభలు..
తొర్రూరులో ప్రియాంక గాంధీ విజయభేరి సభ స్థలాన్ని పరిశీలించిన ఏఐసీసీ ప్రతినిధులు
24న ఉదయం 11 గంటలకు పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో ప్రియాంక బహిరంగ సభ
తర్వాత కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ, 4 గంటలకు ధర్మపురిలో బహిరంగ సభలో పాల్గొంటారు
మంథనిలో ఉద్రిక్తత
పెద్దపల్లి జిల్లా మంథనిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ
అంబేద్కర్ చౌరస్తాలో ఎదురెదురుగా తారసపడ్డ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ప్రచార వాహనాలు
దీంతో ఇరుపక్షాల పోటాపోటీ నినాదాలు..నెలకొన్న ఉద్రిక్తత
ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.
వివేక్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు
మాజీ ఎంపీ, చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు
పది గంటలకుపైగా సోదాలు చేసిన ఐటీ అధికారులు
రామగుండంలోని వివేక్ ఇంట్లో ఉదయం నుంచి జరిగిన ఐటీ రెయిడ్స్
సోదాల తర్వాత బయటికి వచ్చిన వివేక్
కార్యకర్తలకు అభివాదం
నా మీద గెలవలేకే దాడులు
సుమన్ నాపై ఫిర్యాదు చేశాడు
ఓడిపోతున్నామనే భయంలోనే ఫిర్యాదు
సూర్యాపేట ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ కామెంట్స్
అభ్యర్థుల గుణగణాలతో పాటు పార్టీ చరిత్రను చూడాలి
ఓటు వేసేటపుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
రాయేదో రత్నమేదో గుర్తించాలి
ఓటు అనేది ప్రజల చేతిలో ఉన్న వజజ్రాయుధం
ఓటు రాబోయే 5 ఏళ్లలో మీ తలరాతను మారుస్తుంది
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం
15 ఏళ్లు రాజీలేని పోరాటం చేశాం
కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టింది
సూర్యాపేటకు నీళ్లు రాకుండా చేసిందే కాంగ్రెస్
కరెంటు లేదు.. మంచి నీళ్లు లేవు..సాగు నీళ్లు లేవు
పెన్షన్ రూ.5 వేలు చేస్తాం
సూర్యాపేటలో ఒకప్పుడు పంట ఎంత..ఇప్పుడెంత
నీటి పన్ను బకాయిలు రద్దు చేసి పన్నే లేకుండా చేశాం
రైతుబంధు పథకాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం
రైతు బీమా ఇచ్చాం
రైతుబంధు ఎకరానికి 16 వేలు చేస్తాం
కరెంటు 3 గంటలు చాలని పీసీసీ చీఫ్ అంటున్నడు
10 హెచ్పీ మోటర్కు పైసలవెరివ్వాలె
ధరణి తీసి బంగాళఖాతంలో వేస్తమని భట్టి విక్రమార్క చెప్తున్నడు
ధరణి తీసేస్తే రైతుబంధు ఎట్ల వస్తది
మేం గెలిచిన తెల్లారే రోడ్డు మీద పండవెట్టి తొక్కుతమని రాజగోపాల్రెడ్డి మాట్లాడుతున్నడు
కేసీఆర్కు భట్టి విక్రమార్క కౌంటర్
కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారు
ఇల్లు లేని వారికి ఇళ్లివ్వడం ఇందిరమ్మ రాజ్యం
వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లిచ్చింది ఇందిరమ్మ రాజ్యం
అట్టడుగు వారిని పైకి తీసుకురావడమే ఇందిరమ్మ రాజ్యం
పరిశ్రమలు, డ్యామ్లు నిర్మించడమే ఇందిరమ్మ రాజ్యం
కేసీఆర్ తెలంగాణలో మళ్లీ ఫ్యూడల్ వ్యవస్థ తీసుకువచ్చారు
కేసార్ అనే బండరాయిని రత్నం అనుకొని పదేళ్లు నెత్తిన పెట్టుకున్నారు
70పైన కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారు
సీఎంగా ఉండి కేసీఆర్ ఫాంహౌజ్కే పరిమితమయ్యారు
రుణమాఫీపై హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
17 వేల కోట్ల రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బును ఇప్పటికే బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించింది
మరో 2 వేల కోట్లు చెల్లిస్తే మిగతాది కూడా పూర్తవుతుంది.
అయినా రుణమాఫీ కానివారెవరైనా ఉంటే తనకు దగ్గరకు రావాలంటూ రైతులకు భరోసా
ఆ డబ్బు బ్యాంక్ కు తానే చెల్లించి రైతులను ఆదుకుంటానంటూ వ్యాఖ్యలు
వీణవంక మండలం ఎలబాక ప్రచారంలో ఇంకా రుణమాఫీ కాలేదని అడిగిన ఓ రైతుకు సమాధానం
అవసరమైతే తానే బ్యాంకుకు చెల్లిస్తానని హామీ
మల్కాజిగిరిలో నిర్మలా సీతారామన్ కామెంట్స్
కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధులు ఎక్కడ నిలిపివేశామో చెప్పాలి
దళితున్ని సీఎం చేస్తామని చెప్పి కేసీఆర్ మాట తప్పారు
కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే ఒక్క పైసా కూడా ఆపలేదు
ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చే ఆలోచన కేంద్రానికి లేదు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వర్గీకరణపై బిల్లు ప్రవేశపెడతాం
కేసీఆర్ ను జాతీయ నేతగా ఎవరూ ఒప్పుకోవటం లేదు
బీఆర్ఎస్ జాతీయ పార్టీ అనేది ఒక బూటకం
బంగారం లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశారు
పది లక్షలకు గాను.. 8లక్షల ఉద్యోగాలను కేంద్రం భర్తీ చేసింది
డిసెంబర్ లోపు మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేస్తాం
మోటార్లకు మీటర్లు అనేది శుద్ధ అబద్ధం
డోర్నకల్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ కామెంట్స్
దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి రాలేదు
డెమొక్రసీలో పరిణితి సాధించిన దేశాలే ముందుకు వెళ్తున్నాయి
అభ్యర్థుల గుణగణాలతో పాటు వారి పార్టీల వెనుక ఉన్న చరిత్రను పరిశీలించాలి