IND VS SA 3rd ODI: సంజూ సెంచరీ.. బట్లర్‌ ఏం చేశాడో చూడండి..!

21 Dec, 2023 21:17 IST|Sakshi

ఇంగ్లండ్‌ పరిమత ఓవర్ల జట్టు కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ తన ఐపీఎల్‌ జట్టు (రాజస్థాన్‌ రాయల్స్‌) సారధి సంజూ శాంసన్‌పై ఉన్న ప్రేమను ప్రత్యేకంగా చాటుకున్నాడు. సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్‌ 21) జరుగుతున్న మూడో వన్డేలో సంజూ సెంచరీ (108) సాధించగా.. బట్లర్‌ తన కెప్టెన్‌ సాధించిన ఘనతను, అలాగే మరో రాయల్‌ (చహల్‌) కెప్టెన్‌ను అభినందిస్తున్న దృశ్యాన్ని తన ఇన్‌స్టా స్టోరీగా పోస్ట్‌ చేశాడు. బట్లర్‌ ఈ పోస్ట్‌ చేసిన నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారింది.

బట్లర్‌.. తన ఐపీఎల్‌ సహచరుడు సాధించిన ఘనతను సెలబ్రేట్‌ చేసుకోవడంపై భారత క్రికెట్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంజూతో సమానంగా బట్లర్‌ను కూడా అభినందనలతో ముంచెత్తుతున్నారు. రాయల్స్‌కు తమ కెప్టెన్‌పై ఉన్న ప్రత్యేకమైన అభిమానానికి ఫిదా అవుతున్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. సిరీస్‌ డిసైడర్‌లో క్లిష్టమైన పిచ్‌పై జట్టు కషాల్లో (49/2) ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన సంజూ.. తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాకు భారీ స్కోర్‌ను అందించాడు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా సంజూ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూతో పాటు తిలక్‌ వర్మ (52) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖర్లో రింకూ సింగ్‌ (38) తనదైన స్టయిల్‌లో మెరుపులు మెరిపించాడు.

>
మరిన్ని వార్తలు