CWC 2023 IND Vs SL: లంకతో మ్యాచ్‌.. బెస్ట్‌ ఫీల్డర్‌ మెడల్‌ విన్నర్‌ ఎవరంటే..?

3 Nov, 2023 11:46 IST|Sakshi

ప్రస్తుత ప్రపంచకప్‌లో ఫీల్డ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే భారత ఆటగాళ్లకు జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ టి దిలీప్‌ బెస్ట్‌ ఫీల్డర్‌ మెడల్‌ను బహుకరిస్తున్న విషయం తెలిసిందే. శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌కు గాను ఈ మెడల్‌ను శ్రేయస్‌ అయ్యర్‌ గెలుచుకున్నాడు. శ్రేయస్‌ ఈ అవార్డును గెలుచుకోవడం ఇది రెండోసారి. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు గాను శ్రేయస్‌ తొలిసారి ఈ అవార్డును అందుకున్నాడు. తాజాగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఫీల్డ్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో పాటు రెండు క్యాచ్‌లు అందుకున్నందుకుగాను శ్రేయస్‌ను ఈ అవార్డు వరించింది.

విజేతను అనౌన్స్‌ క్రికెట్‌  గాడ్‌..
ప్రతి మ్యాచ్‌ అనంతరం వినూత్న రీతిలో మెడల్‌ విన్నర్‌ను అనౌన్స్‌ చేయించే దిలీప్‌.. ఈసారి ఎవరూ ఊహించని విధం​గా ఓ స్పెషల్‌ పర్సన్‌తో అవార్డును అనౌన్స్‌ చేయించాడు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ వర్చువల్‌గా శ్రేయస్‌ను విజేతగా ప్రకటించాడు. విజేతను ప్రకటించడంతో పాటు టీమిండియాను అభినందించి, బెస్ట్‌ విషెస్‌ చెప్పాడు. ఈ సందర్భంగా సచిన్‌ టీమిండియాకు తన అమూల్యమైన సందేశాన్ని కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది.

ఇదిలా ఉంటే, వాంఖడే వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్‌ అధికారికంగా సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. గిల్‌ (92), కోహ్లి (88), శ్రేయస్‌ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్‌ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్‌ షమీ (5-1-18-5), మొహమ్మద్‌ సిరాజ్‌ (7-2-16-3), జస్ప్రీత్‌ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్‌ రజిత టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
 

మరిన్ని వార్తలు