భారీ విజయంతో భారత్‌ శుభారంభం

28 Oct, 2023 01:41 IST|Sakshi

రాంచీ: ఆసియా మహిళల హాకీ చాంపియన్స్‌ ట్రోఫీ టోర్నమెంట్‌లో భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. థాయ్‌లాండ్‌ జట్టుతో శుక్రవారం జరిగిన తమ తొలి లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 7–1తో నెగ్గింది. భారత్‌ తరఫున సంగీత కుమారి (29వ, 45వ, 45వ ని.లో) మూడు గోల్స్‌ చేయగా... మోనిక (7వ ని.లో), లాల్‌రెమ్‌సియామి (52వ ని.లో), సలీమా టెటె (15వ ని.లో), దీపిక (40వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. 

మరిన్ని వార్తలు