టొరంటో (కెనడా): నేషనల్ బ్యాంక్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–మాడిసన్ కీస్ (అమెరికా) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–కీస్ ద్వయం 7–5, 3–6, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’ లో సోఫియా కెనిన్ (అమెరికా)–యులియా పుతింత్సెవా (కజకిస్తాన్) జంటను ఓడించింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా–మాడిసన్ కీస్ ద్వయం నాలుగు ఏస్లు సంధించి, పత్యర్థిజోడీ సర్వీస్ను
నాలుగు సార్లు బ్రేక్ చేసింది.
చదవండి: Chicago Open ATP Challenger Tennis: పోరాడి ఓడిన సాకేత్–యూకీ బాంబ్రీ జోడీ