దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. సంజూ సెంచరీతో భారత జట్టు అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. 2023 ఏడాదిలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఈ ఏడాదిలో భారత జట్టు నుంచి ఇప్పటివరకు 19 సెంచరీలు నమోదయ్యాయి.
అంతకముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా జట్టు పేరిట ఉండేది. సౌతాఫ్రికా ఈ ఏడాదిలో మొత్తం 18 సెంచరీలు చేసింది. తాజా సెంచరీతో దక్షిణాఫ్రికాను టీమిండియా అధిగమించింది. అదే విధంగా ఈ ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లి(6) నిలిచాడు.
ఆ తర్వాతి స్ధానంలో యువ ఓపెనర్ శుబ్మన్ గిల్(5) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 78 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.