IND Vs NZ: ఏందయ్యా ఈ ఆటతీరు.. పాక్‌తో మ్యాచ్‌ చాలా బెటర్‌

31 Oct, 2021 21:56 IST|Sakshi

Fans Troll Team India Batting Failure Vs NZ.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా టాపార్డర్‌ బ్యాటర్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. రోహిత్‌ను కాదని ఓపెనర్‌గా పంపిన ఇషాన్‌ కిషన్‌ 4 పరుగులే చేయగా.. ఫామ్‌లో ఉన్నాడని భావించిన రాహుల్‌ కూడా 18 పరుగులు చేసి ఔటయ్యాడు.

చదవండి: IND Vs NZ: ఔట్‌ నుంచి తప్పించుకున్న రోహిత్‌.. రితికా శర్మ రియాక్షన్‌


ఇక వన్‌డౌన్‌లో వచ్చిన రోహిత్‌ శర్మ తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డప్పటికీ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. 14 పరుగులకే రోహిత్‌ పెవిలియన్‌ చేరాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అర్థసెంచరీతో రాణించిన కోహ్లి మరోసారి దానిని రిపీట్‌ చేయలేకపోయాడు. కేవలం తొమ్మిది పరుగులే చేసి సోథీ బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. పంత్‌ కూడా 12 పరుగులు చేసి మిల్నే బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

చదవండి: Mohammad Shahzad: టి20 క్రికెట్‌లో మహ్మద్‌ షెహజాద్‌ అరుదైన ఘనత

దీంతో టీమిండియా టాపార్డర్‌ ఆటతీరుపై దారుణమైన ట్రోల్స్‌ మొదలయ్యాయి. అసలు ఆడుతుందా టీమిండియానేనా అన్నట్టుగా ఉంది.. ఐపీఎల్‌ మోజూ ఇంకా టీమిండియాకు పోనట్టుంది.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ చాలా బెటర్‌.. కనీసం పోరాడారు.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేశారు.. ఇంకేంటి మరి అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో కూడా ఓడిపోండి.. దరిద్రం వదులుతుంది అంటూ కామెంట్స్‌తో రెచ్చిపోయారు. ప్రస్తుతం అభిమానులు కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని వార్తలు