పాక్‌తో వన్డే సిరీస్‌కు తాలిబన్ల పచ్చజెండా: పాక్‌ క్రికెట్‌ బోర్డు

19 Aug, 2021 21:22 IST|Sakshi

లాహోర్‌: అఫ్గనిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న దుర్భర పరిస్థితుల నేపథ్యంలో పొరుగు దేశమైన పాక్‌తో శ్రీలంక వేదికగా వచ్చే నెలలో జరగాల్సిన వన్డే సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే, ఈ సిరీస్‌కు తాలిబన్లు అంగీకారం తెలిపారని, ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే సిరీస్‌ యధావిధిగా కొనసాగుతుందని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) పేర్కొనడం సంచలనంగా మారింది. తాలిబన్లు మొదటి నుంచి క్రికెట్‌కు వ్యతిరేకులుగా ఉండటంతో ఈ సిరీస్‌ జరగడం అసాధ్యమని అంతా అనుకున్నారు. అయితే, సిరీస్‌ నిర్వహణకు తాలిబన్ల నుంచి అనూహ్యంగా మద్దతు లభించడంతో క్రికెట్‌ ప్రపంచం మొత్తం అవాక్కయ్యింది. కాగా, సెప్టెంబర్‌ 1 నుంచి 5 వరకు శ్రీలంకలోని హంబన్‌తోట వేదికగా పాక్‌, ఆఫ్గన్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరగాల్సి ఉంది. 
చదవండి: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రషీద్‌ ఖాన్‌ భావోద్వేగం

మరిన్ని వార్తలు