కొరుక్కుపేట: తిరునెల్వేలి జిల్లా అంబా సముద్రం సమీపంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్ను కొడవలితో దాడి చేశారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలంటూ రవాణా కార్మికులు సమ్మెకు దిగారు. అంబాసముద్రం సమీపంలోని పాపనాశం నుంచి తిరునెల్వేలి కొత్త బస్టాండ్కు ప్రభుత్వ బస్సు వెళుతోంది. కల్లకురిచ్చి సమీపంలో బస్సు వెళుతుండగా బైకుల్లో వచ్చిన ముగ్గురు వ్యక్తులు బస్సును అడ్డుకున్నారు. ఇద్దరు బస్సు ఎక్కి వాగ్వాదానికి దిగారు. వీరవనల్లూర్ బస్టాప్ వద్దకు వెళ్లగా డ్రైవర్ రెజీ ముఖంపై కొడవలితో దాడి చేశారు. దీన్ని అడ్డుకునేందుకు వచ్చిన కండక్టర్ కన్నన్న్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ప్రయాణికులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. అనంతరం ముఠా అక్కడి నుంచి పరారైంది. దీంతో డ్రైవర్, కండక్టర్ ఇద్దరిని తిరునెల్వేలి రాయల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో పాపనాశం వర్క్షాప్లోని డ్రైవర్లు, కండక్టర్లు ఈ ఘటనను ఖండిస్తూ వారిని అరెస్టు చేసే వరకు బస్సులు నడపబోమని నిరసన తెలిపారు.