తెలుగు రాష్ట్రాల మీడియా అకాడమీ చైర్మన్ల భేటీ 

19 Nov, 2022 03:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని మీడియా అకాడమీ కార్యాలయంలో ఇరువురు సమావేశమయ్యారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అకాడమీల్లో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేస్తున్న శిక్షణ కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పరస్పరం సహకరించుకునేందుకు ఉన్న అవకాశాలపై చర్చించినట్లు తెలిసింది. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు