వైఎస్సార్‌ పాదయాత్ర దేశ రాజకీయాలలో​ ఓ సంచలనం: భట్టి

4 Jan, 2023 16:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తన పాదయాత్రతోనే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. బుధవారం నగరంలో బోయిన్‌పల్లిలో ఉన్న గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో పీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ శిక్షణా తరగతులకు భట్టి విక్రమార్క హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌ స్ఫూర్తితో అందరూ పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ఆనాడు మీడియా సంస్థలు విచ్చలవిడిగా ఒక నాయకుడినే, ఆ పార్టీతోనే రాష్ట్రం బాగుపడుతుందని చూపిస్తున్న తరుణంలో మహాప్రస్థానం పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో, దేశంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారని చెప్పారు. నాలాంటి ఎంతో మంది వైఎస్సార్ పాదయాత్రలో భాగస్వామ్యులు అయ్యారని తెలిపారు.

చదవండి: (‘చంద్రబాబుకు మీడియా సపోర్ట్‌ చేసినా వైఎస్సార్‌ను ఏం చేయలేకపోయారు’)

మరిన్ని వార్తలు