ప్రారంభమైన ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు

17 Sep, 2020 20:55 IST|Sakshi

సాక్షి, రాజన్నసిరిసిల్ల జిల్లా : వేములవాడలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది అధికమాసం రావడంతో ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మ నిర్వహించి వచ్చే నెల 17 నుండి మళ్లీ యాథవిధిగా బతుకమ్మ వేడుకలు జరుపుకోనున్నారు. రాష్ట్రంలో జరిగే వేడుకలకు భిన్నంగా వేములవాడలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ నిర్వహించనున్నారు. దీంతో స్థానిక మహిళలు అటు పుట్టినింట్లో ఇటు మెట్టినింట్లో రెండు చోట్ల వేడుకలు జరుపుకునే అవకాశం ఉంది. రాష్ట్రమంతా అక్టోబర్ 22 తేదిన సద్దుల బతుకమ్మ వేడుకలు జరపనున్నారు. (17న ఎంగిలిపూల బతుకమ్మ )

(‘తెలంగాణ నుంచి స్పందన లేదు..’)

మరిన్ని వార్తలు