Ganesh Immersion In Hyderabad: నిలిచిపోయిన గణనాథుడు.. ట్యాంక్‌ బండ్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌

26 Sep, 2023 10:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: గణేష్‌ నిమజ్జనంతో ట్యాంక్ బండ్‌పై కోలాహలం నెలకొంది. అయితే ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఓ విగ్రహ తీసుకెళ్తున్న వాహనం నిలిచిపోగా.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.  ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఇది చోటు చేసుకోగా.. దాదాపు ఐదు గంటల పాటు అధికారులు స్పందించలేదని తెలుస్తోంది. 

ట్రాక్టర్‌పై విగ్రహం తీసుకెళ్తుండా.. టైర్‌ డ్యామేజ్‌ అయ్యి వాహనం ఆగిపోయింది. దీంతో ట్యాంక్ బండ్ వద్ద భారీ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. చాలా సేపటి దాకా ట్రాఫిక్‌ పోలీసులు పట్టించుకోలేదని వాహనదారులు మండిపడుతున్నారు.

మరోవైపు పీవోపీ(ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌) విగ్రహాల నిమజ్జనం తాత్కాలిక కుంటల్లోనే చేయించాలంటూ జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై ట్యాంక్‌ బండ్‌పై నిన్న నిరసన చేపట్టారు కొందరు.

మరిన్ని వార్తలు