బంజారాహిల్స్: ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో చొరబడ్డ ఆరడుగుల పొడవైన త్రాచుపామును మరో విశ్రాంత ఐపీఎస్ అధికారి చాకచక్యంగా బంధించారు. దాన్ని సురక్షితంగా అటవీ శాఖాధికారులకు అప్పగించారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్రోడ్ నెం.72లోని ప్రశాసన్నగర్లో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ప్రశాసన్నగర్లోని ప్లాట్నెంబర్ 199లో విశ్రాంత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య నివాసం ఉంటున్నారు.
ఇంట్లోని వాటర్ట్యాంక్ వద్ద సుమారు ఆరడగుల పొడవున్న త్రాచుపాము శుక్రవారం ఉదయం కనిపించింది. దీంతో కృష్ణయ్య కుటుంబం అదే కాలనీలో ఉంటున్న రిటైర్డ్ డీజీపీ రాజీవ్ త్రివేదికి సమాచారం అందించింది. రాజీవ్ త్రివేది... పామును నేర్పుతో ఓ బ్యాగులో బంధించారు. అటవీశాఖ అధికారులకు అప్పగించారు.