ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ కొత్త చైర్మన్‌గా ప్రొ.అశోక్‌

2 Sep, 2023 04:23 IST|Sakshi
ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లో సిల్వర్‌జూబ్లీ శిల్పాన్ని ఆవిష్కరించిన కొత్త చైర్మన్‌ ప్రొఫెసర్‌ అశోక్‌ ఝన్‌ఝన్‌వాలా, ప్రొఫెసర్‌ రాజ్‌రెడ్డి తదితరులు

రాయదుర్గం (హైదరాబాద్‌): ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ నూతన చైర్మన్‌గా ప్రొఫెసర్‌ అశోక్‌ ఝన్‌ఝన్‌వాలా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన పాలక మండలి ప్రత్యేక సమావేశంలో ఒక ప్రకటన చేశారు. 1998లో ఆరంభం నుంచి ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ చైర్మన్‌గా కొన సాగిన ప్రొఫెసర్‌ రాజ్‌రెడ్డి పదవీ విరమణ చేశారు. శుక్రవారం సాయంత్రం గచ్చిబౌలిలో ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా కొత్త చైర్మన్‌ అశోక్‌ ఝన్‌ఝన్‌వాలా, పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్‌ రాజ్‌రెడ్డి, డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పీజే నారాయణన్, ఇతర ప్రొఫెసర్లతో కలసి నూతనంగా రూపొందించిన సిల్వర్‌జూబ్లీ శిల్పాన్ని ఆవిష్కరించారు. ప్రొఫెసర్‌ అశోక్‌ ఝన్‌ఝన్‌ వాలా మాట్లాడుతూ ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ను జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో మంచి గుర్తింపు పొందేలా తీర్చిదిద్దు తానని తెలిపారు. ప్రొఫెసర్‌ పీజే నారాయణన్‌ మీడియాతో మాట్లాడుతూ, ట్రిపుల్‌ఐటీ హైదరా బాద్‌.. దేశంలో నంబర్‌వన్‌ స్థానంలో ఉందన్నారు.

మరిన్ని వార్తలు