10వ తేదీవరకు సికింద్రాబాద్‌ నుంచి పలు రైళ్లు రద్దు.. ఎంఎంటీఎస్‌ కూడా..

4 Sep, 2023 05:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాంకేతిక కారణాల దృష్ట్యా వివిధ మార్గాల్లో 20 దూరప్రాంతాల రైళ్లను, నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే మరో 16 ఎంఎంటీఎస్‌ రైళ్లను ఈ నెల 4 నుంచి 10 వరకు రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు కాజీపేట్‌–డోర్నకల్, విజయవాడ–డోర్నకల్, భద్రచాలం రోడ్‌–డోర్నకల్, కాజీపేట్‌–సిర్పూర్‌ కాగజ్‌నగర్, బల్లార్ష– కాజీపేట్, సికింద్రాబాద్‌–వరంగల్, సి ర్పూర్‌ టౌన్‌–భద్రాచలం, వరంగల్‌– హైదరాబాద్, కరీంనగర్‌–సిర్పూర్‌టౌన్, కరీంనగర్‌–నిజామాబాద్, కాజీపేట్‌–బల్లార్ష తదితర మార్గాల్లో  రైళ్లు రద్దు కానున్నట్లు పేర్కొన్నారు.  

ఎంఎంటీఎస్‌లు రద్దు: ఈ నెల 4 నుంచి 10 వరకు లింగంపల్లి–నాంపల్లి, లింగంపల్లి–ఫలక్‌నుమా, ఉందానగర్‌–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో 16 సర్వీసులు రద్దు కానున్నట్లు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు