రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ 

14 Jun, 2022 01:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా విలువైన ప్రాణాలను కాపాడేందుకు నిస్వార్థంగా రక్తదానం చేస్తున్న రక్తదాతలందరికీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాతలు ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్లాది మంది జీవితాలను రక్షిస్తున్నారని కొనియాడారు. రక్తదానం ఉదాత్తమైన, మానవీయమైన, అమూల్యమైన చర్య అన్నారు. రక్తదాతల ఉదారమైన సేవకు గుర్తింపుగా ఏటా జూన్‌ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.  

మరిన్ని వార్తలు