ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ
ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 7, 8, 9, 10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి జూన్ 5న, 6వ తరగతిలో ప్రవేశాల కోసం అదే నెల 6వ తేదీన రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని పేర్కొంది. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటాయని తెలిపింది. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు రూ.75, మిగతా వారు రూ.150 చెల్లించాలని వెల్లడించింది. మరిన్ని వివరాలు తమ వెబ్సైట్ (http://telanganams.cgg.gov.in)లో పొందవచ్చని తెలిపింది. దరఖాస్తుల ను ఏప్రిల్ 15 నుంచి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించింది.
ప్రవేశ పరీక్షకు సంబంధించిన వివరాలు..