కోహిర్‌@ 8.9

16 Dec, 2023 05:08 IST|Sakshi
మంథని–పెద్దపల్లి రహదారిపై శుక్రవారం కమ్ముకున్న పొగమంచు – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి 

రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు 

సాక్షి,నెట్‌వర్క్‌/హైదరాబాద్‌: రాష్ట్రాన్ని చలి గజగజ వణికిస్తోంది. రాత్రివేళనేకాదు...పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 8.9 డిగ్రీలుగా నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్‌ జిల్లా చౌదరిగూడెంలో 9.4 డిగ్రీలు, కుమ్రంభీం జిల్లా సిర్పూరు(యు)లో 9.7 డిగ్రీలు నమోదు కావటంతో వాతావరణశాఖ అలర్ట్‌ నోటీస్‌ జారీ చేసింది.

ఆయా జిల్లాల వారీగా చూస్తే... 
రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే..గరిష్ట ఉష్ణోగ్ర­త ఖమ్మంలో 30.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 12.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఆదిలాబాద్, నల్లగొండ, హైదరాబాద్, వరంగల్, మెదక్, కరీంనగర్‌లో ఉష్ణోగ్ర­త­లు సాధారణం కంటే 1.8 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యా­యి. రానున్న మూడు రోజుల పాటు ఇదే తరహాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు