టమాటా కిలో రూ.100

24 May, 2022 02:41 IST|Sakshi

మంచిర్యాల అగ్రికల్చర్‌: మంచిర్యాల మార్కెట్‌లో సోమవారం టమాటా కిలో రూ.100 చొప్పున విక్రయించారు. మార్చిలో కిలో రూ.20 నుంచి రూ.30 ఉండగా.. ప్రస్తుతం ధర భారీగా పెరిగింది. 20కిలోల బాక్సు గత నెల రూ.800 నుంచి రూ.వెయ్యి పలికింది. సోమవారం రూ.1600 పలికింది. ఎండలతో రెండు మూడు కిలోల వరకు పాడైపోతున్నాయి. దీంతో కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు కూరగాయల  వ్యాపారి ఎల్లమ్మ తెలిపింది. 

మరిన్ని వార్తలు