సాక్షి, హైదరాబాద్: పరేడ్ గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం జరగనున్న బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు ఈ సభకు హాజరుకానున్నారు. పలు రహదారులు నిర్బంధం, మళ్లింపుల కారణంగా రద్దీ ఎక్కువగా ఉంటుందని, దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ముందుగా చేరుకోవాలని సూచించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చుట్టూ 3 కి.మీ. పరిధిలో అన్ని రహదారులు, జంక్షన్లు రద్దీగా ఉంటాయని, తదనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సికింద్రాబాద్ ప్లాట్ ఫారమ్ నంబర్ 1 వైపు నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకునేటప్పుడు ట్రాఫిక్ రద్దీ ఉంటుంది కాబట్టి ప్రయాణికులు చిలకలగూడ వైపు నుంచి ప్లాట్ఫాం 10 నుంచి స్టేషన్కు చేరుకోవాలని తెలిపారు.
(చదవండి: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే)