Hyderabad: ఇద్దరు యువతుల అదృశ్యం 

18 Nov, 2022 14:32 IST|Sakshi
ముస్కాన్‌, సైదియా బేగం (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: కిరాణాషాపునకు వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లోనుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైంది. గురువారం సీఐ భాస్కర్‌ తెలిపిన మేరకు.. మహమ్మద్‌ కాజా పటేల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని చిన్న కుమార్తె సైదియా బేగం (20) ఈ నెల 15 సాయంత్రం 4 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. బంధువులు,స్నేహితుల ఇళ్లల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్‌ పోలీసులు తెలిపారు.  

ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ప్రేమ్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం మూసాపేట సఫ్దార్‌నగర్‌లో అన్నీ బేగం తన కుమార్తెలతో కలిసి నివాసముంటోంది. పెద్ద కుమార్తె ముస్కాన్‌ ఇంటివద్దే ఉంటుంది. బుధవారం తెల్లవారుజామున అన్నీ బేగం నిద్ర లేచేసరికి తన పెద్ద కుమార్తె ముష్కాన్‌ కనిపించలేదు. దీంతో  కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

మరిన్ని వార్తలు