చిల్లకూరు: తూర్పు కనుపూరులోని ముత్యాలమ్మ దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఆలయంలో అట్టహాసంగా సాగింది. నూతనంగా ఎంపికై న పాలకమండలి సభ్యుల చేత ఆలయ ఈఓ నవీన్కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎక్స్ అఫిషియో మెంబర్తో కలిపి మొత్తం 10 మంది చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ పాలక మండలి చైర్పర్సన్గా గూడూరుకు చెందిన సిద్ధారెడ్డి ఇంద్ర శీనారెడ్డిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే శ్రీనివాసులు(కోట), చిల్లకూరు వెంకటేశ్వరమ్మ, దువ్వూరు సాయికృష్ణారెడ్డి(దొరువుకట్ట), ఎల్లసిరిపుష్పలత(నల్లాయగారిపాళెం), దువ్వూరు చంద్రశేఖర్రెడ్డి(బల్లవోలు), ఉప్పాల ప్రభాకర్(కొత్తపట్నం), భానుబాలాజీ ( వంజివాక), పర్వతాల విమల(కాకులారిపాళెం)తోపాటు ఆలయ అర్చక చాకిరీ రమణయ్య ఎక్స్అఫిషియో సభ్యుడిగా ప్రమాణం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు కొవడలూరు దామోదర్రెడ్డి, యరటపల్లి జానకీరామిరెడ్డి, దువ్వూరు కృష్ణారెడ్డి, చిల్లకూరు దశరథరామిరెడ్డి, ఉప్పల ప్రసాద్గౌడ్, జెడ్పీటీసీ మన్నెం శీనయ్య, ఎంపీటీసీ జానకీరాం, కిరణ్రెడ్డి, మనోజ్రెడ్డి పాల్గొన్నారు.