More

బేగంపేటలో విద్యార్థులపై దూసుకెళ్లిన కారు

12 Nov, 2013 15:30 IST

హైదరాబాద్: విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థులపై కారు దూసుకెళ్లిన సంఘటన మరువక ముందే హైదరాబాద్లో ఈరోజు అటువంటి  ప్రమాదమే జరిగింది. బేగంపేట్‌లోని పీజీ కాలేజ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ముగ్గురు విద్యార్థులపై దూసుకెళ్లింది. విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి.  వారిని ఆస్పత్రికి తరలించారు.

విజయవాడలోని రామవరప్పాడులో ఈ నెల 7వ తేదీ గురువారం బస్సు కోసం నిల్చున్న విద్యార్థులపై కారు దూసుకుపోవడంతో నలుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.  ఈ ప్రమాదంలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థినులు జ్యోతి, సింధూజ, చందుశ్రీ,  పీజీ విద్యార్థి  సురేష్  మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగి వారం రోజులు కూడా కాకుండానే బేగంపేటలో అదే విధంగా కారు దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ గుండెపోటుతో యువకుడి మృతి

విశాఖ ప్రమాదంపై సీఎం జగన్‌ ఆరా

Nov 19th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర.. 17వ రోజు షెడ్యూల్‌ ఇదే..

విశాఖ ప్రమాదంలో కొత్త కోణం.. యూట్యూబర్‌ ఎక్కడ?