More

పత్తి రైతు ఆత్మహత్య

29 Jul, 2015 09:02 IST

వెల్దుర్తి (గుంటూరు): అప్పుల బాధతో ఓ పత్తి రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన రైతు ఎం.రాముడు (40) మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి అతడు విగతజీవిగా కనిపించాడు. రాముడు తనకున్న పొలంతోపాటు పక్క గ్రామంలోనూ ఆరెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. అయితే, గత కొన్నేళ్లుగా నష్టాలు వస్తుండడంతో చేసిన అప్పు రూ.10 లక్షలకు చేరిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుల బాధతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వారు విలపిస్తున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ ఫలితంపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్

టీడీపీకి కొత్త టెన్షన్‌.. బెడిసికొట్టిన ‘బాబు’ ప్లాన్‌!

టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా?: విజయసాయిరెడ్డి

పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

విజయనగరం జిల్లా: టీ కాస్తుండగా పేలిన గ్యాస్‌ సిలిండర్‌