More

గోడను ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి

21 Apr, 2017 10:30 IST

తిరుపతి: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని ఎమ్మార్‌పల్లి రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

స్థానికంగా ఉంటున్న ముగ్గురు యువకులు గురువారం రాత్రి నగర శివారులో పుట్టినరోజు వేడుకలు జరుపుకొని తిరిగి వస్తున్న క్రమంలో ఎమ్మార్‌పల్లిలో రోడ్డు పక్కన ఉన్న ఓ గ్యాస్‌ గొడౌన్‌ గోడను బలంగా ఢీకొన్నారు. ఈ ఘటనలో శశికాంత్, జయకుమార్‌ ఆచారి అనే ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో యువకుడు రూపేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని స్విమ్స్‌కు తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

టీడీపీకి కొత్త టెన్షన్‌.. బెడిసికొట్టిన ‘బాబు’ ప్లాన్‌!

టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా?: విజయసాయిరెడ్డి

పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

విజయనగరం జిల్లా: టీ కాస్తుండగా పేలిన గ్యాస్‌ సిలిండర్‌

దేశంలోనే నంబర్‌ 1 మెరైన్‌ స్టేట్‌ ‘ఏపీ’