సాక్షి, అమరావతి: దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ‘పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. ఆయన ఒక సునిశిత బుద్ధి గల రాజకీయవేత్త. అంతే కాదు, ఒక బహుభాషా కోవిదుడు. ఈ దేశాన్ని పీవీ నరసింహారావు సరళీకృత ఆర్థిక విధానాల వైపు నడిపించారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి తరతరాలకూ చిరస్మరణీయంగా ఉంటుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
సునిశిత బుద్ధి గల రాజకీయవేత్త పీవీ
29 Jun, 2020 03:00 IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళి
మరిన్ని వార్తలు :
Tags