⇒ మధ్యాహ్నం 1 గంటకు రైతునగరం నుంచి ప్రారంభం
⇒ ప్రకటించిన జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి
కర్నూలు : నంద్యాల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 9వతేదీ నుంచి పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు రైతునగరంలో నుంచి ఉపఎన్నిక ప్రచారం ప్రారంభిస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రైతునగరం నుంచి రోడ్డు మార్గం గుండా గోస్పాడు మండలంలోని ఎస్.కల్లూరు వరకు మొదటిరోజు రోడ్షో కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
రెండో రోజు నంద్యాల పట్టణంలోని నూనెపల్లె నుంచి ఉపఎన్నికల ప్రచారం ప్రారంభమై నంద్యాల మండలంలోని కొత్తపల్లి వద్ద ముగుస్తుందని ప్రకటించారు. మూడో రోజు శుక్రవారం చాపిరేవుల వద్ద రోడ్షో ద్వారా ప్రారంభమైన ప్రచారం నంద్యాల పట్టణం వైఎస్సార్నగర్ వరకు కొనసాగుతుందని గౌరు వెంకటరెడ్డి వివరించారు.